నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాఫబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు రెండో సీజన్ ని కొనసాగుతూ విజయవంతంగా దుసుకుపోతోంది.ఇందులో ఎంతోమంది డైరెక్టర్లు, నటీనటులు , రాజకీయ నాయకులు గెస్ట్లుగా రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా బాలయ్య తన షోని ఉమెన్స్ స్పెషల్ షో గా మార్చేశారు. హీరోయిన్లు జయసుధ ,జయప్రద యువ హీరోయిన్ రాశి ఖన్నా గెస్టులుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా.. శ్రీదేవితో తనకున్న విభేదాల పైన జయప్రద తెలియజేయడం జరిగింది.
జయప్రదను ఉద్దేశించి మాట్లాడుతూ దర్శకుడు సత్యజిత్ అన్న మాటలను గుర్తు చేశారు బాలయ్య ఇంత అందగత్తె ఈ భూలోకంలో పుట్టి ఉండదని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా.. జయప్రద సిగ్గు పడడం జరిగింది. అయితే ఆ తర్వాత సత్యజిత్ అన్న మాటలు నిజమేనా అంటే జయప్రద తల ఊపడంతో..ఆమె అందాన్ని జయసుధ బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. జయసుధ గురించి జయప్రద తెలియజేస్తు చిన్నప్పటినుంచి కలిసే ఉన్నాము కలిసే పెరిగాము కలిసే నటించాము నేను జయసుధ ఇంటికి వెళ్లేదాన్ని వాళ్ళ అమ్మ అందరూ కూడా నాకు బాగా తెలుసు అని తెలిపింది.
ముఖ్యంగా అడవి రాముడు సినిమా షూటింగ్ సమయంలో మా మధ్య స్నేహం మరింత బలపడిందని తెలిపింది. కృష్ణ గారితో ఏకంగా 48 సినిమాలలో నటించాను ఆయనతో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్లలో నేను కూడా ఒకరిని తెలిపింది. అలాంటి నటుడు దూరం అవ్వడం చాలా దురదృష్టకరమని తెలిపింది జయప్రద. వివాహమైన కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించాలని తెలిపింది. ఇక శ్రీదేవితో విభేదాలపై మాట్లాడుతూ మేమిద్దరం కలిసి నటించే సమయంలో సెట్ లోకి రాగానే మా ఇద్దరి మధ్య రాజి చేసేందుకు డైరెక్టర్లకు ఒక పనిగా ఉండేదని తెలిపింది. అయితే కేవలం మా మధ్య ప్రొఫెషనల్ గా మంచి పోటీ తత్వం ఉండేది ఆమె కంటే గొప్పగా మేకప్ చేసుకోవాలి ఆమె కంటే నేను గొప్పగా డ్రెస్ వేసుకోవాలని ప్రయత్నించే దానిని.. శ్రీదేవి కూడా నాతో ఆ విషయంలో పోటీ పడేదని అందువల్లే మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జయప్రద తెలిపింది.