రవితేజలో ఈ కొత్త మార్పు గ‌మ‌నించారా?

`క్రాక్‌` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో మళ్లీ ఫ్లాపుల్లో కూరుకుపోయాడు. ప్రస్తుతం ఈయ‌న `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. త్రినాధరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌వితేజ‌, శ్రీ‌లీల జంట‌గా న‌టించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో స్వ‌రాలు అందించాడు. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఎన్ని సినిమాలు చేసినా ర‌వితేజ‌ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా యాక్టివ్ గా కనిపించరు. ఆడియో ఫంక్షన్స్ లో, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో రవితేజ పెద్దగా మాట్లాడరు. ఇంటర్వ్యూలలో అయితే వన్ వర్డ్ ఆన్సర్స్ తో స‌రిపెడ‌తారు.

కానీ, ధ‌మాకా విష‌యంలో అలా కాదు. ర‌వితేజ‌లో కొత్త మార్పు క‌నిపిస్తోంది. నెల రోజుల ముందు నుంచే ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు రవితేజ. ఇటీవల ‘ఢీ’ షోకి అతిథిగా వెళ్లారు. అలాగే ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఎంతో ఉత్సాహంగా చాట్ చేశారు. తాజాగా ఫ్యాన్ మీట్ కూడా పెట్టారు. ఇన్నేళ్ల కెరీర్ లో ర‌వితేజ ఫ్యాన్ మీట్ పెట్ట‌డం ఇదే తొలిసారి. మొత్తానికి రవితేజ తన పద్ధతి మార్చుకుని..కొత్త సినిమా `ధమాకా`ను ప్రేక్ష‌క‌ల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ సినిమా ఆయ‌న‌కు ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.