ఇప్పటికీ నావల్ల కావట్లేదు అంటున్న ఛార్మీ..షాక్ లో ఫ్యాన్స్..!

కరోనా సెకండ్ వేవ్ ఎంత విద్వాంసాన్ని సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా ఒక్కరేమిటి ప్రపంచ దేశాల ప్రజలు కరోనా దాడికి తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా అందరిని ఒక ఆట ఆడుతుంది కరోనా.. ఈ కరోనా తో అందరూ మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోతే .. మరికొంతమంది పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు అనాధలవడం, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాధలవడం ఇలా ఎన్నో బాధాకరమైన సన్నివేశాలను మనం రోజు సోషల్ మీడియా ,న్యూస్ ఛానల్ అలాగే వార్తాపత్రికల ద్వారా చూస్తూనే ఉన్నాము.

నిత్యం మనం వీటిని చూస్తూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉండదు అనడంలో ఆశ్చర్యం లేదు.. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ సమయాన ఏం జరుగుతుందో తెలియక ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే అలాంటి సందర్భంలోనే నటి ఛార్మీ గతంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది. ప్రముఖ హీరోయిన్ గా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న ఛార్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అంద చందాలతో కుర్ర కారును మెత్తెక్కించిన ఈమె హీరోయిన్గా సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో నటనకు గుడ్ బై చెప్పేసి.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థ బాధ్యతలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే నటి ఛార్మీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అంతే కాదు అది చూసి నా వల్ల కావట్లేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.. సోషల్ మీడియాలో కరోనా విలయతాండవాన్ని చూడలేకపోతున్నాను. ప్రతిరోజు చక్కటి రోజులు కావాలి అంటే కుదరదు కదా.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తట్టుకోవాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ బాధలన్నీ చూడలేక నేను సోషల్ మీడియా నుండి నిష్క్రమిస్తున్నాను అని తెలిపిందిం ఈ విషయం అభిమానుల గుండెల్లో అలజడి సృష్టించింది. ఇకపోతే అప్పటినుంచి ఇప్పటివరకు ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో అభిమానులు మరింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.