సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై పలు వార్తలు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అయితే గతంలో హీరో వెంకటేష్ రోజా మధ్య ఏదో వివాదం ఉందనే వార్త గతంలో బాగా వైరల్ గా మారింది. దీంతో రోజా వెంకటేష్ దాదాపుగా 27 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదని టాక్ కూడా ఉంది. అసలు వీరిద్దరూ మాట్లాడుకోకపోవడానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే వీరిద్దరూ మాట్లాడుకోకపోవడానికి ముఖ్య కారణం చినరాయుడు సినిమా అన్నట్లుగా సమాచారం. ఈ కారణం వల్లే వీరిద్దరి మధ్య విభేదాలకు దారితీసిందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ రోజా తన భర్త డైరెక్టర్ సెల్వమని దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమాని చేద్దామనుకున్నారట. అందుకోసం పలు చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల చేత ఈ కాంబినేషన్ అసలు కుదరలేదట.ఇదే కథతో కొన్నేళ్ల తర్వాత చిన్న రాయుడు సినిమాని తెరకెక్కించారు.కానీ ఆ సమయంలో రోజాకు బదులుగా హీరోయిన్ విజయశాంతిని తీసుకోవడం జరిగిందట. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత రోజా ఈ సినిమాను చూసి చాలా మండిపడినట్లు అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి.
ముఖ్యంగా తాను నటించాల్సిన హీరోయిన్ పాత్రలో ఇంకొకరిని ఎలా చేస్తారని చిత్ర యూనిట్ మీద చాలా ఆవేదన వ్యక్తం చేసిందట. అయితే ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని దర్శకనిర్మాతల వల్లనే హీరోయిన్ ని మార్చవలసి వచ్చిందని చెప్పారట వెంకటేష్. ఇక అటు తర్వాత వెంకటేష్ ,రోజా కాంబినేషన్లో పోకిరి రాజా కాంబినేషన్ సెట్ చేయడం జరిగింది. రోజాని వెంకటేష్ క షూటింగ్ కోసం ముంబైకి పిలిపించిన చిత్ర యూనిట్ రోజాని అక్కడ ఒక హోటల్లో ఉంచారట. ఇక అలా ఉన్న హోటల్లో ఈమె మూడు రోజులైనా షూటింగ్ కి పిలవకపోవడంతో విసుకు వచ్చి తన భర్త బర్త్డే సందర్భంగా ముంబై నుంచి తిరిగి తన భర్త బర్త్డే వేడుకలకు హాజరయ్యిందట రోజా. ఇక తర్వాత దర్శక నిర్మాతలు ఆమెను బతిమాలి సినిమా షూటింగ్ పూర్తి చేయించారు.. ఇక ఆ రోజు నుంచి వెంకటేష్ తో సినిమా చేయకూడదని నిర్ణయం తీసుకుందట రోజా.ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల లేవని సమాచారం.