`జై బాల‌య్య‌`కు రెస్పాన్స్ కేక‌.. ట్రోల్స్ తోనే భారీ వ్యూస్ కొల్ల‌గొట్టిందిగా!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, `క్రాక్‌` డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. దునియా విజ‌య్‌, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ జైబాలయ్య మాస్ ఆంథెమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. `రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు..` అంటూ మొద‌లైన ఈ పాటు నంద‌మూరి అభిమానులు విశేషంగా ఆక‌ట్టుకుంది.

కానీ, కొంద‌రు నెటిజ‌న్లు, యాంటీ ఫ్యాన్స్ మాత్రం `జైబాల‌య్య` సాంగ్ `ఒసేయ్ రాములమ్మ`కు కాపీ అంటూ తెగ ట్రోల్ చేశారు. అయినాస‌రే ఈ సాంగ్ కు రెస్పాన్స్ కేక‌లా వ‌చ్చింది. యూట్యూబ్ లో అయితే ఈ సాంగ్‌కు త‌క్కువ స‌మ‌యంలోనే10 మిలియన్ వ్యూస్ అందుకొని అదరగొట్టింది. మొత్తానికి ట్రోల్స్ తో ఈ సాంగ్ భారీ వ్యూస్ కొల్ల‌గొట్ట‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.