ఇండియన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవిత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె తన భర్త పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కరలు కొడుతుంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. సానియా మీర్జా గత కొద్ది రోజులకు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఈ వార్తలను నిజం అనుకునేలా అనిపిస్తున్నాయి. ఈ సందర్భంలోనే గతంలో సానియా కొన్ని హాట్ కామెంట్లు చేసింది. ఇక ఆ కామెంట్లు ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి.
ఈమె బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ను వివాహం చేసుకోవాలనుకుందట. ఈ విషయాన్ని సానియా బుల్లితెరపై ఓషోలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పట్లో సానియా- షాహిద్ కపూర్తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ టైంలో వీరిద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోకు సానియా వెళ్ళినప్పుడు. షాహిద్ కపూర్ తో డేటింగ్ వార్తలపై స్పందించింది.
ఈ విషయం గురించి కరణ్ జోహార్ అడగగా.. వాటి గురించి నాకు పెద్దగా తెలియదని చెప్పింది. ఈ క్రమంలోనే సానియాని- కరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మీరు ఏ హీరోని పెళ్లి చేసుకుంటారు.. ఏ హీరోని చంపేస్తారు.. ఏ హీరోతో డేటింగ్ చేస్తారని అడగగా.. నేను రణబీర్ కపూర్ను పెళ్లి చేసుకుంటానని, రణ్వీర్తో డేటింగ్ చేస్తానని, షాహిద్ కపూర్ ని చంపేస్తానని చెప్పింది. సానియా మీర్జా చేసిన ఈ ప్రకటన అప్పుట్లో ఎంతో చర్చనీయాంశంగా మారింది.
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని 2010లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అప్పట్లో రెండు దేశాల మధ్య ఎంతో వివాదాస్పదంగా మారింది. వీరికి 2018లో ఇజహాన్ మిర్జా మాలిక్ అనే ఒక కుమారుడు జన్మించాడు. తాజాగా వీరిద్దరూ విడిపోతున్నట్లు ఇటీవల షోయబ్ మాలిక్ మిత్రుడు తెలిపాడు. వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారు అని అంతేకాకుండా వారిద్దరు ఎందుకు విడపోతున్నారు వివరాలు నేను చెప్పలేనని కూడా అతను అన్నాడు.