టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఈ నెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తొలి శ్వాస విడిచారు.
జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే నేడు కృష్ణ పెద్ద కర్మ. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
`నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో మీ అభిమానమే ఎంతో విలువైనది. దానికి నేను ఆయనకు రుణపడి ఉంటాను. నాన్నగారు నాతో పాటు మీ గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మీ అభిమానం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న` అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, జేఆర్సీ కన్వెన్షన్లో అభిమానులకి భోజనం ఏర్పాట్లు చేసిన మహేష్ బాబు.. రాజకీయ, సినీ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన నటుడికి సంతాపం తెలిపేందుకు దాదాపు 5 వేల మంది అభిమానులు ఈ పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరు అయ్యారని అంటున్నారు.