సినిమాల మీద ఉన్న పిచ్చితో బిడ్డ‌ను చంపుకున్న హీరోయిన్.. ఎంత‌ దారుణం..?

ఏ.ఎం. రత్నం డైరెక్షన్ లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన `పెద్దరికం` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది సుకన్య. ఆ తరువాత హీరో రాజశేఖర్ తో కలిసి `అమ్మ కొడుకు` అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే 1996లో వచ్చిన `భారతీయుడు` సినిమాలో విశ్వ నటుడు కమలహాసన్ సరసన వృద్ధురాలు పాత్రలో సుకన్య పలికించిన హవ భావాలు అందరిని ఎంతగానో ఆకర్షించాయి.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుకన్యకు హాలీవుడ్ లో కూడా ఆఫర్లు వచ్చాయి. అయితే 2022లో శ్రీధర్ రాజగోపాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా పెళ్లైన సంవత్సరానికే అంటే 2003లోనే భర్తతో విడాకులు తీసుకుంది. అయితే అప్పట్లో సుకన్యకు సినిమాల మీద ఉన్న పిచ్చితో ఏకంగా తన కడుపులో బిడ్డను కూడా చంపుకుందని వార్తలు వచ్చాయి.

అయితే సుకన్య పెళ్లయ్యాక కొన్ని రోజులకు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్యానర్ నుంచి `ఆనందం` అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాల మీద ఉన్న పిచ్చితో తన భర్తకు చెప్పకుండా కడుపులో బిడ్డను అబార్షన్ చేయించుకుని తన చేతులతోనే చంపేసుకుంది. ఇక ఈ కారణంగానే వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారని.. పైగా సినిమాల మీద ఉన్న మోజుతో అబార్షన్ కూడా చేయించుకుందని స్వయంగా తన భర్త శ్రీధర్ మీడియా ముందు బయట పెట్టాడు.