బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా, హీరోయిన్ల వర్ష బొల్లమ నటించిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లక్ష్మణ్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా నాగార్జున ,చిరంజీవి నటిస్తున్న సినిమాలకు పోటీగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా పైన ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు బడా చిత్రాల మధ్య ఈ చిన్న సినిమా రిలీజ్ అవుతుంది అంటే కచ్చితంగా ఈ సినిమా పైన మంచి హోప్ ఉంటేనే చిత్ర బృందం ఇలా ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం ప్రేక్షకులలో మరింత హైప్ ని పెంచేలా చేసింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ వర్ష బొల్లమ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో ఎన్టీఆర్ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్న యాంకర్ అడగక.. నాకు ఇష్టమైన హీరో అంటూ ఎవరూ లేరు ఇది చాలా సేఫ్ ఆన్సర్ అయితే..RRR సినిమా చూసిన తర్వాత కొమరం భీముడు పాట చూసినప్పుడు ఎన్టీఆర్ నటన చాలా అద్భుతంగా అనిపించింది.
ఆ పాటలో కోపంతో ,బాధతో ఉన్నప్పుడు ఎన్టీఆర్ బుగ్గలు చూపించినప్పుడు గుజ్ బంప్స్ వచ్చాయి. అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక స్వాతిముత్యం సినిమాలో తన పాత్ర ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుందని తెలియజేసింది. తన మటనకు మాత్రం మంచి పేరు వస్తుందని ఈ ముద్దుగుమ్మ తెలియజేసింది. మరి అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన ఈ చిత్రం సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.