నిర్మాతగా రాబోతున్న నందమూరి వారసురాలు..!!

గత సంవత్సరం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంతో బాలయ్యలో పలు మార్పులొచ్చాయని చెప్పవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ ఇమేజ్ లో కూడా పలుమార్పు తెచ్చిన చిత్రమని కూడా చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఆఖండ. ఇక తర్వాత ఆహా తో ఓటిటి లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చి బాలయ్యలో మరొక కోణం ఉందని చూపించారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక బాలయ్య కూతురు హస్తం ఉందని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు.

Nandamuri Tejaswini Personal Photos - Lovely Telugu
బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఆన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షో కి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నదట. బాలకృష్ణ డేట్స్ మరియు ఇతర వర్కు సంబంధించి కార్యక్రమాలను ఈమె స్వయంగా చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆహా టీమ్ తో కలిసి తన తండ్రి లుక్ ను మరియు కాస్టింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.అయితే ఇప్పుడు తేజస్విని నిర్మాతగా మారిపోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తన తండ్రి బాలయ్యతో ఒక చిత్రాన్ని నిర్మించడానికి ఈమె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Balakrishna Daughter Wedding | Tejaswini Marriage Invitation | Nandamuri  Family Fans - Filmibeat
అందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ విషయంలో కూడా పనులు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ని ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే బాలకృష్ణ ప్రస్తుతం కమిట్మెంట్ ఉన్న చిత్రాల కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎంతోమంది నటీనటుల వారసులు కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరి అడుగుజాడల్లోనే బాలకృష్ణ కూతురు కూడా తేజస్విని నడవబోతోంది.మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.