ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక నిత్యం యోగ , ఎక్సర్ సైజ్ చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగా ఆహారం విషయంలో కూడా డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా సినిమాలలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రకు తగ్గట్టుగా గ్లామర్ గా కనిపించడానికి లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకసారి హీరోయిన్ అందం కోసం.. ఒక మూవీ మేకర్స్ కి లక్షల్లో ఖర్చు అయ్యిందట. సినిమాలలో ఒక హీరోతో పోల్చుకుంటే హీరోయిన్స్ కి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు నిర్మాతలు. ముఖ్యంగా హీరోయిన్స్ మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో కాస్త ఎక్కువగానే బడ్జెట్ పెడుతూ ఉంటారు.
అయితే అది సర్జరీ కోసం కాదు మేకప్ కోసం కూడా కాదు.. మరి ఆ హీరోయిన్ ఎవరు అంటే నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ఒక సినిమా కోసం రష్మిక లక్షల ఖర్చు చేశారట సినిమా మేకర్.. ఛలో సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మిక.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక కోసం చాలా ఖర్చు చేశారట నిర్మాతలు. మరీ ముఖ్యంగా ఆమె బొడ్డు కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నిర్మాతతో లక్షల ఖర్చు చేయించారట.. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఒక పాట కోసం రష్మిక బొడ్డును చూపించాల్సి వచ్చిందట. అయితే రష్మిక మందన్న బొడ్డు కాస్త ఎత్తుగా అనిపించడంతో గ్రాఫిక్స్ లో ఆ నాభి నీ నాజుకుగా చూపించడానికి గ్రాఫిక్స్ ఉపయోగించారట. అలా గ్రాఫిక్స్ కోసం అక్షరాల 30 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం.
అలా రష్మిక బొడ్డు కోసం రూ.30 లక్షల ఖర్చు పెట్టారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే.