పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన బిల్లా చిత్రం తాజాగా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో హీరోయిన్గా అనుష్క నటించింది. నమిత కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కృష్ణంరాజు పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో బాగానే అలరించారు. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈనెల 23న 4k వర్షన్ లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ ,నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసిధ తదితరులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభాస్ తారక్ మధ్య ఉన్న స్నేహం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
బిల్లా సినిమాలో ఎయిర్ పోర్ట్ సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి కెమెరా వైపుగా నడుచుకుంటూ వచ్చారని.. ఎవరా అని చూస్తే ఎన్టీఆర్ అని మెహర్ రమేష్ తెలిపారు. ఏంటి ఇక్కడ అని అడిగితే.. షూటింగ్ చూసేందుకు వచ్చానని ఎన్టీఆర్ చెప్పారట. అంతేకాకుండా షూటింగ్ తర్వాత ప్రభాస్ చేసిన వంటను తిన్నారని ఇక తను కూడా వంట చేసి మా అందరికీ వడ్డించారని ఇలా వీరిద్దరూ ఆరోజు చాలా బాగా ఎంజాయ్ చేశారని డైరెక్టర్ మెహర్ రమేష్ తెలిపారు.
అలాగే బిల్లా సినిమాకు కృష్ణంరాజు అనుకున్న దానికంటే చాలా సపోర్ట్ చేశారని రెండు హెలికాప్టర్లు అడిగితే నాలుగు తెప్పిద్దామని తెలియజేశారట. అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా కొత్త కార్లు కొన్నామని కారులను స్నాష్ చేశాం ఈ సినిమాలో కృష్ణంరాజు గారు నటించాలని ఆలోచన ప్రభాస్ దే అని తెలిపారు. పెదనాన్న నేను కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరిక అని తెలియజేయడంతో ఈ సినిమాలో కృష్ణంరాజు నటించారని తెలిపారు మెహర్ రమేష్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.