సోషల్ మీడియా పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన ఆనందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి నటించిన చివరి చిత్రం గార్గి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Sai Pallavi Killing Her Career?
సాయి పల్లవి తన డైట్ గురించి మాట్లాడుతూ తను పూర్తిగా శాకాహారిణి అని కేవలం అన్నం, పప్పు ఉంటే చాలని తెలియజేసింది. సెట్ లో ఎక్కువగా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు వంటివి మాత్రమే తాగుతానని.. అందుచేతను ఎక్కడ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు అని తెలియజేస్తుంది. ముఖ్యంగా అధికంగా తినడం ఎందుకు అవి అరీగే వరకు జిమ్ములో కసరతులు చేయడం అవసరం లేదని తెలియజేసింది. అప్పుడప్పుడు కేవలం సరదాగా బ్యాడ్మింటన్ మాత్రమే ఆడతానని తెలియజేసింది. ఇక సోషల్ మీడియాలో ఎందుకు టచ్ లో ఉండరనే అనే ప్రశ్న ఎదురవ్వగా.. అదొక టైం వేస్ట్ వ్యవహారమని డైరెక్ట్ గా చెప్పేసింది.

Exclusive: Sai Pallavi Rejects Big Fat Endorsement Deal

ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి అంటే కేవలం తన చెల్లెలుతోనే చెబుతానని. ఇక టాలీవుడ్లో ఫేవరెట్ హీరో మాత్రం మహేష్ బాబు అని తెలియజేసింది. మహేష్ బాబు స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపింది అల్లు అర్జున్తో ఒక సినిమా అయినా చేయలేదు కానీ ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది ఇక బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టమని తన డాన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని తెలియజేస్తుంది. ముఖ్యంగా మాధురి దీక్షిత్ డాన్స్ చూసి ఆ స్టెప్పులు ప్రాక్టీస్ చేసేదాన్ని తెలిపింది సాయి పల్లవి.