బాలయ్య చేసిన పని చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్.. చివరికి..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది ఎన్నో ఒడిగుడ్డుకులను ఎదుర్కొని.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలి అంటే వారి ఎన్నో కష్టాలు పడక తప్పదు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు గతంలో కూడా ఈ స్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక తమ టాలెంట్ తో.. సంపాదించిన డబ్బుతో కొంత నలుగురికి సహాయం చేస్తారు. ముఖ్యంగా ఈ క్రమంలో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ముందుగా గుర్తొచ్చే పేరు స్వర్గీయ నందమూరి తారకరామారావు .. ఆయన పుట్టుకతో కోటీశ్వరుడు కాదు ..తన అద్భుతమైన టాలెంట్ తో నటసార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఆ తర్వాత స్థానంలో మురళీమోహన్ కూడా ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి జయభేరీ సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఒకరోజు రాత్రి నాతో పాటు కొంతమంది ఆయనను కలవడానికి వెళ్ళాము. అప్పుడు ఎన్టీఆర్ భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండి బ్రదర్ అని పిలిచారు . ఆయనతో కలిసి కడుపునిండా భోజనం చేసిన తర్వాత .. షూటింగ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా.. ఐస్ క్రీమ్ తిందామా బ్రదర్ అని ఎన్టీఆర్ అన్నారు. అప్పుడు ఒక పిల్లవాడిని పిలిచి ఏడు ఐస్ క్రీమ్లకు ఎంత అవుతుందో చిల్లర లెక్క పెట్టి ఇచ్చారు. ఇక అది చూసి నాకు నవ్వు రావడంతో.. మురళి ఎందుకు నవ్వుతున్నావ్ అని ఎన్టీఆర్ నన్ను అడిగారు.. చిల్లరకు బదులుగా 100 రూపాయలు ఇస్తే చిల్లర తిరిగి తీసుకొస్తాడు కదా సార్ అని నేను అన్నాను.

అప్పుడు ఎన్టీఆర్ గారు నేను చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని, ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. పాలు పోసి జీవనం సాగించే సాధారణ కుటుంబంలో నేను పుట్టాను. ఇక ఈ స్థాయిలో ఉన్నప్పుడు కోట్ల సంపాదన ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టను అని చెప్పాడు. కానీ నా కొడుకు బాలకృష్ణ ఒక పెద్ద స్టార్ ఇంట్లో పుట్టాడో.. అతను పుట్టుకతోనే కోటీశ్వరుడు ..వరద సహాయం కోసం ఎవరైనా వస్తే వెంటనే లక్ష లేదా రెండు లక్షలు ఇస్తాడు అని ఎన్టీఆర్ వాక్యానించారట. ముఖ్యంగా ఎన్టీఆర్.. బాలకృష్ణ ఖర్చుల విషయంలో ఆశ్చర్యపోయారు అని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.