అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎన్టీఆర్..!

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక్క సినిమా అనౌన్స్మెంట్ రాకపోవడం అభిమానులను తీవ్రస్థాయిలో కలవర పెట్టింది అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి సినిమా తర్వాత తన సినిమా కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్నానని గతంలోనే ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ ఎనిమిది నెలలు కావస్తున్న ఇప్పటికీ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ కి సంబంధించి ఒక అప్డేట్ కూడా రాకపోవడం అభిమానులను మరింత డిప్రెషన్కు గురిచేసింది. దీంతో కొరటాల శివ పై కొంతమంది అభిమానులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

ఇకపోతే గతంలో తనకి జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తోనే తన తదుపరిచిత్రం ప్రకటించడంతో అభిమానుల సైతం ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. మేకర్స్ మాత్రం నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియా వేదికగా వారిని కూడా నిలదీయడం మొదలుపెట్టారు అభిమానులు. ఇకపోతే ఫాన్స్ అసహనాన్ని గమనించిన ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుని డిసెంబర్ నుంచి పట్టాలెక్కించాలని దర్శకుడు కొరటాల శివకు కండిషన్ పెట్టాడట.

తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు కొరటాల శివ ఎన్టీఆర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది . ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్, రాజమౌళితో జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ ఇండియాకి తిరిగి వచ్చేసాడు. కొంతకాలంగా ఆలస్యం అవుతున్న కొరటాల ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక అన్ని ఓకే అయితే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే నవంబర్లోనే మంచి ముహూర్తం చూసి ప్రారంభించబోతున్నట్లు కొరటాల శివ వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులకు వూరట కలిగిస్తోంది.