ఆ విషయంలో ఎప్పుడు తల్లితో గొడవ..చనిపోయాక అర్ధం చేసుకున్న మహేశ్..!!

మనిషి బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు.. దూరమయ్యాకే ఆ విలువ మనకు ఏంటో తెలుస్తుంది అని మన పెద్దలు ఊరికే అనరు. మన జీవితంలో మన మంచి కోరుకునే వ్యక్తులు మనతో ఉన్నంతకాలం వాళ్ళ విలువ మనకి తెలిసి రాదు. ఒక్కసారి వాళ్లు మనకు దూరమైతే కచ్చితంగా వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడు గడిపిన క్షణాలను.. జ్ఞాపకాలను ..చెప్పిన మంచి మాటలను గుర్తు చేసుకుంటాం. ప్రజెంట్ అలా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని స్వీట్ మెమోరీస్ ని గుర్తు చేసుకొని బాధపడిపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.

మనకు తెలిసిందే ఈ మధ్యనే మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి అనారోగ్య కారణంగా మృతి చెందారు. దీంతో మహేష్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాడు . అసలు బయటే కనిపించడం లేదు సినిమా షూటింగ్లు ఆపేసుకున్నాడు . ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా అమ్మగారు గదిలో కూర్చొని అమ్మ ఫోటో దగ్గర ఏడుస్తున్నారట. అయితే ఇదే టైంలో అమ్మతో కలిసి ఉన్నప్పుడు జ్ఞాపకాలు గొడవ పడిన సందర్భాలను గుర్తుచేసుకొని మహేష్ బాబు చాలా ఎమోషనల్ అవుతున్నారట .

మరీ ముఖ్యంగా మహేష్ బాబు తన తల్లికి దగ్గరగా ఉంటారట,,తన తల్లితో ఎప్పుడు క్లోజ్ గా ఉంటారట. ఎన్ని సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా సరే కచ్చితంగా రోజుకు ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడుతాడట. వీలైనప్పుడల్లా అమ్మతో టైం స్పెండ్ చేస్తూ అమ్మఒడిలో పడుకోవడం అంటే మహేష్ బాబుకు చాలా ఇష్టమట. అయితే మహేష్ బాబు తల్లికి మహేష్ బాబుకి ఎప్పుడు ఒక విషయంలో గొడవ వచ్చేదట. మహేష్ బాబు డైటింగ్ అంటూ కడుపు మాడ్చుకుంటుంటారని,, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని… అందంగా ఉండడం సినిమాలో ఉండే వాళ్లకు ఇంపార్టెంట్.. అయినా ఆరోగ్యం చాలా ముఖ్యమని.. అంతేకాకుండా షూటింగ్లో పడిపోతే మహేష్ బాబు టైంకి ఫుడ్ తినరని .. దీంతో అమ్మ ఎప్పుడు ఆరోగ్యం గురించి కాన్సన్ట్రేషన్ చేయి అంటూ చెప్పుకొచ్చేదట. మహేష్ బాబు తల్లి చనిపోయే ముందు వారం రోజుల వరకు కూడా మహేష్ బాబుతో అదే గొడవ అయిందట. అయితే ఇప్పుడు అదే విషయాలను గుర్తు చేసుకొని మహేష్ బాబు బాధపడుతున్నట్లు తెలుస్తుంది.