చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే కలెక్షన్ల పరంగా బాగానే రాబట్టుకున్నట్లుగా సమాచారం. పరిమితి సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడమే ఇందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హర్యానా గవర్నర్ బిజెపి సీనియర్ నేతలలో ఒకరైన బండారు దత్తాత్రేయ దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ అనే కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది.
ఈ ప్రోగ్రాం లో చిరంజీవి మాట్లాడుతూ ఈ ప్రోగ్రాంకు రావాలని కొంతకాలం నుంచి అనుకుంటున్నాను. అల్లు అరవింద్ కు, పవన్ కు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది కానీ నాకు దత్తాత్రేయ గారి నుంచి ఆహ్వానం అందలేదని తెలియజేశారు. ఆయన దృష్టి పడిన తర్వాతే ఈ ప్రోగ్రాం కి వద్దాం అనుకున్నానని చిరంజీవి తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ దక్కిన రోజు ఈ ప్రోగ్రాంకు తనకు ఆహ్వానం అందడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి తెలియజేశారు.
ముఖ్యంగా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు అని నేను ఎన్నోసార్లు ఇలాంటి వాటిని కట్టడి చేశానని తెలిపారు.హీరోల మధ్య విభేదాలు ఉండకూడదని నా సినిమాలు సక్సెస్ అయిన సమయంలో అందరిని పిలిచి విందు ఇచ్చేవాడినని చిరంజీవి తెలిపారు. నేనూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో నా పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయని అంతేకాకుండా కొంతమంది రక్తం అమ్ముకుంటున్నారని.. తన పైన ఆరోపణలు చేసినా తను ఏనాడు కూడా స్పందించలేదని తెలియజేశారు చిరంజీవి. అంతేకాకుండా మాటకు లొంగనివాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి కామెంట్లు చేయడం జరిగింది.అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నేను ఎప్పటినుంచో ఆచరిస్తూ ఉన్నానని చిరంజీవి తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.