వీరసింహారెడ్డి సినిమా వల్ల బాలయ్య క్రేజ్ పెరిగిందా.. తగ్గిందా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. టైటిల్ లో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద రివిల్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడింది.

బాలయ్య మజాకా.. వీర సింహారెడ్డి బడ్జెట్ తెలిస్తే షాక్..! - Telugu Journalist

మరొకపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్లు కూడా భారీగానే వస్తున్నాయని తెలుస్తోంది. రెండు వారాలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. ఇక వెంటనే ఈ సినిమాకు గ్యాప్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్ ప్రకటించారు. వీరసింహారెడ్డి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.

Nandamuri Balakrishna's film has been named 'Veera Simha Reddy'

ఈ చిత్రం బడ్జెట్ రూ.100 కోట్ల రూపాయలు దాటేసిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక బాలయ్య కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రంగా నిలుస్తోందని తెలుస్తోంది. అఖండ రిజల్ట్ తో ఈ సినిమా మేకర్ బడ్జెట్ విషయంలో ఎలాంటి అడ్డంకులు పెట్టుకోకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా థియేటర్ బిజినెస్ కూడా రూ.80 కోట్ల రూపాయల వరకు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాన్ థియేటర్ రైట్స్ విషయంలో కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుండి కూడా మంచి ఆఫర్ వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తూ ఉన్నారు. అఖండ నిర్మాతలకు రూ 70 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. వీరసింహారెడ్డికి రూ 100 కోట్లు అంటే బాలయ్య మార్కెట్ రూ.30 కోట రూపాయలు మార్కెట్ పెరిగిందని చెప్పవచ్చు. దీంతో బాలకృష్ణ క్రేజ్ గతంలో కంటే ప్రస్తుతం పెరిగిందని చెప్పవచ్చు.