రోజాపై సెటైర్లు వేసిన నటుడు పృథ్వీరాజ్..!!

తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 30 ఇండస్ట్రీ ఇక్కడ అంటూ డైలాగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ప్రతి నాయకుడు పాత్రలో కూడా నటించి మెప్పించారు పృథ్వీరాజ్. మొన్నటి వరకు పృథ్వీరాజ్ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి చేరుతూ పార్టీలపై వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన తాజాగా పృథ్వీరాజ్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రోజా అతనిని పెళ్లి చేసుకుందని చెన్నైలో రాజధాని.. పృథ్వీ కామెంట్స్ వైరల్

ఈసారి ఏకంగా పృథ్వీరాజ్ నటి మంత్రి రోజా పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ లో జరిగిన జనవాని కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పలు మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ గురించి అతని కార్యక్రమం గురించి చాలా తప్పుగా చూపించినట్లు తెలియజేశారు పృథ్వీరాజ్. ఈ నేపథ్యంలోనే మంత్రి రోజా గురించి మాట్లాడుతూ వైజాగ్ లో వైసీపీ గర్జన కార్యక్రమం ఫ్లాప్ కావడంతో జనసేన కార్యక్రమం పైన మంత్రి రోజా బురదజల్లే ప్రయత్నం చేస్తుంది అంటూ పృద్వి షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది.

Roja comments on Pawan Kalyan About JFC || Telugu Bullet
పవన్ కళ్యాణ్ మీద రోజా చాలాసార్లు మాట్లాడడం జరిగింది.. అయితే ఎప్పుడూ కూడా మంత్రి రోజా పైన నేను ఎప్పుడూ కూడా కామెంట్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ ను దూషించకపోతే తన మంత్రి పదవి పోతుందని ఉద్దేశంతోనే ఆమె ఇలా చేస్తోంది అంటూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మేమంతా ఒక సినీ ఇండస్ట్రీలోని కళామ్మతల్లి బిడ్డలం కాబట్టే ఇంత హుందాగా ఉన్నాము రోజా హుందాతనాన్ని చూపించుకోలేకపోతోంది అంటూ కామెంట్స్ చేశారు పృథ్వీరాజ్. ఒకవేళ రోజా తమిళ వ్యక్తిని వివాహం చేసుకుంది పార్టీ మరి చెన్నైలో రాజధాని పెడతారా అంటూ కామెంట్లు చేశారు. మరి పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.