ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ బట్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్ అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది అంటే ఇక ఈమె నటనకు ప్రేక్షకులు ఏ విధంగా ఫిదా అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆలియా భట్ రణబీర్ కపూర్ జంటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఇక ఇద్దరు కూడా ఎవరికివారు సొంతంగా స్టార్లుగా ఎదిగిన వారే.. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు . ఎన్నో సంవత్సరాలు పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఏడాది ఏప్రిల్ 14వ తేదీన పెళ్లితో ఒక్కటయింది.
మరికొద్ది రోజులు ఆగితే తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. ఇప్పుడు రణబీర్ తాతయ్య రాజ్ కపూర్ కట్టించిన కృష్ణ రాజ్ అనే అతి పెద్ద బంగ్లాలో అలియా భట్ తో కలసి కాపురం పెట్టేందుకు కూడా రణబీర్ కపూర్ సిద్ధమవుతున్నాడు. ఇక సినిమాల పరంగా చూస్తున్నట్లయితే ఇద్దరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల వీరిద్దరూ నటించడం బ్రహ్మాస్త్ర సినిమా కూడా కథపరంగా డిజాస్టర్ గా మిగిలినా.. కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వసూలు చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ జంటకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..
అదేమిటి అంటే అలియా భట్ ను వివాహం చేసుకోవడం వల్లే ఇప్పుడు రణబీర్ కపూర్ కోరి కష్టాలను అనుభవిస్తున్నాడు అంటూ ఒక టాక్ వినిపిస్తోంది. ఇక అదేంటి అంటే అలియా భట్ ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరు.. రూ. 100 కోట్ల ఆస్తి కూడా ఉంది. రణబీర్ కపూర్ కి కూడా రూ.కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా డిజాస్టర్ కావడంతో రణబీర్ తల్లి నీతూ కపూర్ ఇలా ఫీల్ అవుతూ ఉందట .. జాతకాలు, గ్రహాలు వంటివి ఎక్కువగా నమ్ముతారు ఆమె.. ఇది ఇలా ఉండగా వీరిద్దరి జాతకాలు అసలు కలవలేదట. ఇక పెళ్లి విషయంలో కూడా ఆమె పెద్దగా ఇష్టపడలేదు. రణబీర్ కపూర్ జాతకానికి కలిసి వచ్చే అమ్మాయిని పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ రణబీర్ కపూర్ తల్లి మాట వినకుండా ఆలియా భట్ ను వివాహం చేసుకున్నాడు. ఇలా కష్టాలను కోరి తెచ్చుకున్నాడు అంటూ నీతూ కపూర్ ఫీల్ అవుతున్నట్లు సమాచారం.