‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు. అయన చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. ‘కేజిఎఫ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబినేషన్లో ‘సలార్’ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్ను ముగించుకుని. మూడో షెడ్యూల్లో అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ పై కోప పడినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.
ప్రభాస్ ఈ సినిమాలో కాకుండా ఇంకా మూడు సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ ఈ మూడు సినిమాలు షూటింగ్ గు ఒకేసారి పాల్గొంటున్నాడు. దీంతో ఆయన మెక్కోవర్ ఎప్పటికప్పుడు మారిపోవడంతో ప్రశాంత్ నీల్ ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్కు ఏం చేయాలో అర్థం కాక ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మట్టికి డూప్ తో తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వార్తలు బయటికి రావటంతో డైరెక్టర్ ప్రశాంతి నీల్ పై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.