స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూజా హెగ్డే సౌత్ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోయిన్గా కొనసాగుతుంది. రీసెంట్ గా పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ బిజీగా ఉంది. ఇటీవల దళపతి విజయ్ తో బీస్ట్ సినిమాలో నటించి అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రానున్న ssmb 28 లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదెల ఉండగా ఈ భామ మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన కన్నడ స్టార్ హీరో యాష్. ఈ గడ్డం హీరోతో సినిమాలు చేసేందుకు ఇప్పుడు దర్శక నిర్మాతలు బాగా ఆసక్తి చూపిస్తున్నారన్న సంగతి అందరికీికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మఫ్టీ ఫ్రేమ్ నర్తన డైరెక్షన్లో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు యాష్.
అయితే ఈ సినిమాలో యాష్ కు జోడిగా పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే నటించబోతున్నట్లు సమాచారం. పూజ అన్ని భాషలలో నటించడంతో ఈమెకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్నందున ఈ సినిమాకు తనే కరెక్ట్ అని దర్శక నిర్మాతలు అనుకుంటున్నట్టు సమాచారం.