చిరంజీవి దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ మంచు విష్ణు… ఏం చేశాడో తెలుసా…!

మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమా `జిన్నా`. ఇక కోనా వెంకట్ కథను అందిస్తూ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణుకు జంటగా పాయల్ రాజ్ పుత్ – సన్నిలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రీజర్ సాంగ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లు సినిమా మేకర్స్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 5 న చిరు `గాడ్ ఫాధ‌ర్`, నాగార్జున `ది ఘోస్ట్` సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు కావడంతో పోటీ ఎక్కువ ఉంటుందని తమ సినిమాను వాయిదా వేసుకున్నట్లు ఓ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ విషయంపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా అదే సరైన నిర్ణయమని వారితో ఏకీభవించినట్లు సమాచారం.

ఇక ఈ సినిమా పోస్ట్ చేయడం అన్న వార్త తెలియడంతో నేటి జన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారు భయపడుతున్నారని కొందరు.. మంచి నిర్ణయం తీసుకున్నారని కొందరు, ఏ సినిమా లేనప్పుడు పెట్టుకోండి.. కనీసం వసూళ్లైనా వస్తాయని ఇంకొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు.

అయితే ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. విష్ణు గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్లీ `జిన్నా` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి విష్ణు కి ఏ రేంజ్ విజయం ఇస్తుందో చూడాలి.