యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘కే జి ఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమలో లో నటించబోతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రశాంత్ నిల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ అవ్వనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఓ పిరియాడిక్ యాక్షన్ డ్రామా అని, ఈ సినిమాలో హీరో మరియు విలన్ రెండు క్యారెక్టర్లు ఎన్టీఆర్ అని..ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని కూడా తెలుస్తుంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం భారీ వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికులో సినిమా వస్తుందంటేనే పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అంటేనే ఈ సినిమాపై అంచనాలు మరో లెవెల్ లో ఉంటాయని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ వార్త బయటికి రావడంతో ఎన్టీఆర్ అభిమానులకి ఇది ఫుల్ కిక్ ఎక్కించే వార్త అని చెప్పవచ్చు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.