అక్కడ ఐటమ్ గర్ల్ గా చూస్తారు.. బాలీవుడ్ పై అనుపమ షాకింగ్ కామెంట్స్..

మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంతో పాపులర్ అయిన నటి అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ‘శతమానం భవతి’ మూవీలో నిత్య పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ బ్యూటీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ‘ఆ ఆ’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అనుపమకు సరైన హిట్ దొరకలేదు.. ఇటీవల వచ్చిన ‘కార్తికేయ-2’తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.

ఆగస్టు 13న రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అనుపమ.. నిఖిల్ జోడిగా నటించింది. మంచి కంటెంట్ అండ్ విజువల్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ టాల్ తెచ్చుకుంది. తెలుగులోనే కాదు హిందీలోనూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. కార్తికేయ 2 మూవీలో అనుపమ పరమేశ్వరన్ నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుపమ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

హీరోయిన్స్ కి బాలీవుడ్ లో ఆఫర్లు వస్తే ఎంతో సంబరపడిపోతారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు భారీ క్రేజ్ వస్తుంది. సౌత్ లో వచ్చిన రెమ్యూనరేషన్ లో సగం ఇచ్చిన బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి హీరోయిన్లు సిద్ధంగా ఉంటారు. కొందరు మాత్రం బాలీవుడ్ లో అవకాశాలు లేక సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతుంటారు.. కార్తికేయ 2 హిట్ తో అనుపమకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

కానీ, అనుపమ మాత్రం బాలీవుడ్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అంతేకాదు బాలీవుడ్ గురించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నార్త్ లో సౌత్ హీరోయిన్స్ ని చులకనగా చూస్తారు. సౌత్ లో ఉన్నప్పుడు ఆ క్రేజ్ కోసం నార్త్ కి తీసుకెళ్తారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అక్కడ ఐటమ్ గర్ల్ గా హీరోయిన్స్ ని చూస్తారు’ అంటూ అనుపమ కామెంట్స్ చేశారు. అందుకోసం బాలీవుడ్ ఆఫర్లను అనుపమ రిజెక్ట్ చేస్తున్నారట..