సీనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే తనదైన శైలిలో లీనమైపోయి నటిస్తూ ఉంటారు ఆయన.. ఇకపోతే ఈయనకు కూడా కొంతమంది హీరోలు డబ్బింగ్ ఆర్టిస్టులుగా పనిచేశారు.. మరి ఎన్టీఆర్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఈతరం హీరో లలో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. అయితే ఏ సినిమాకు డబ్బింగ్ చెప్పారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి జరిగి తెలుసుకుందాం..
నట కిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అంతే కాదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సర్గీయ నందమూరి తారకరామారావు పుట్టిన నిమ్మకూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చిన రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి.. సీరియస్ పాత్రలతో కూడా నటుడుగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. కామెడీకే హీరోయిజం తెప్పించిన రాజేంద్రప్రసాద్.. ఎన్టీఆర్ తో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనాథ కవి సార్వభౌముడు అనే సినిమాలో నటించారు.
ఇక ఈయన ఎన్టీఆర్ కి ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు పూర్తి వివరాల్లోకి వెళితే.. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమాను సావిత్రి జీవిత కథ ఆధారంగా తరికెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో ఏఎన్ఆర్ పాత్రలో అక్కినేని నాగచైతన్య నటించగా.. ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకుంటున్నారట.. కానీ అప్పటికే బాలయ్య తన తండ్రి జీవితం పై ఎన్టీఆర్ బయోపిక్ ను అనౌన్స్ చేశారు.
అందుకే ఈ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రను కుదించమన్నారు. ఇక ఈ చిత్రంలో అన్నగారి పాత్రను వెనకాల నుంచి చూపించడం జరిగింది. అందులో ఎన్టీఆర్ పాత్రకు రెండు డైలాగులు ఉంటాయి. ఆ డైలాగులను ఎన్టీఆర్ చెప్పినట్టుగా రాజేంద్రప్రసాద్ చాలా చక్కగా డబ్బింగ్ చెప్పారు అని.. ఎన్టీఆర్ పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పిన చిత్రంగా మహానటి నిలిచిపోయిందని ఇటీవల ఆలీతో సరదాగా షోకి హాజరైన అశ్వినీ దత్ వెల్లడించారు.