రౌడీ హీరో పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చెర్రీ ఫ్యాన్స్..కారణం ..?

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ , పూరీ జగన్నాథ్ , చార్మికౌర్, అనన్య పాండే అందరూ కూడా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఇకపోతే గత రెండు సంవత్సరాలుగా రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వివాదం రాజుకుంటూనే ఉంది. ఇక ఎన్నోసార్లు వాయిదాలు పడ్డాయి..కానీ సినిమా ఎట్టకేలకు విడుదలవుతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా విజయ్ దేవరకొండ ఒక రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇకపోతే ప్రమోషన్ సమయంలో విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్న తీరును కొంతమంది తప్పు పడుతూ ఉంటే మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు.

అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అతడి వ్యాఖ్యలు, ఆటిట్యూడ్ పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొదటి పాన్ ఇండియా సినిమాకే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే ఇక మిగతా సినిమాల విషయంలో ఇతని పరిస్థితి ఏంటి అంటూ ప్రతి ఒక్కరు దారుణంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కుర్చీ మీద కాలు పెట్టి కూర్చో ని మరీ జర్నలిస్టులతో మాట్లాడటం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే సమయంలోనే మెగా అభిమానులు కూడా విజయ్ దేవరకొండపై కోపం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా పై మీ స్పందన ఏమిటి అని ప్రశ్నించినప్పుడు.. ఎన్టీఆర్ అన్న, చరణ్ అన్న ఇద్దరు చాలా కష్టపడ్డారు. వారికి ఆస్కార్ రావడం అనేది గొప్ప విషయం.. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న ఆస్కార్ సంపాదిస్తున్నారు అంటే ఇక ఆయన టాలెంట్ ఎంతో అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు ఆయనకు 6 భాషలు వస్తాయి.. అన్న గొప్ప నటుడు.. ఆయన వంటి నటుడు ఆస్కార్ దక్కించుకుంటే తెలుగు క్యాతి గర్వపడడం ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ రామ్ చరణ్ తక్కువ చేసి మాట్లాడడంతో విజయ్ దేవరకొండ పై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.