కార్తీకేయ 2 హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు బిగ్ షాక్‌… ఇంతలోనే ఎంత ప‌నైంది..

టాలీవుడ్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా సోకింది. ఆమె తాజాగా వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కార్తికేయ-2 లో న‌టించింది. టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఆమెకు వ‌చ్చిన హిట్ ఇది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆమె స్పీడ్‌గా ఉంది. నార్త్‌, సౌత్‌ సహా చాలా ప్రాంతాలు అనుప‌మ‌ చుట్టేసింది. ఈ క్రమంలో జలుబు, దగ్గు రావ‌డంతో ఆమె కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది.

A lone affair that lingers

దీంతో ఆమె ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కార్తీకేయ 2తో భారీ హిట్టు కొట్టిన అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్‌తో ప‌క్క‌నే ఆమె చేసిన‌ 18 పేజేస్‌ చిత్రం ఏప్రిల్‌ 18న రిలీజ్ అవుతోంది. కార్తికేయ-2తో హిట్‌ అందుకున్న ఈ జోడీ మరోసారి హిట్‌ పెయిర్‌గా నిలుస్తారా లేదా అన్నది చూడాలి.