లైగర్.. హిట్ అయితో ఓకే.. మరి పోతే..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ తుఫాన్ సృష్టించింది. సోషల్ మీడియాను దేశవ్యాప్తంగా ఊపేసింది ఈ లైగర్ ట్రైలర్. ‘‘ఆగ్ లగా దేంగే..’’ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా పేలింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఫైటర్ గా అవతారమెత్తడంతో ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో విజయ్ దేవరకొండ చూపిస్తున్న యాటిట్యూడ్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మినహా మరో బ్లాక్ బస్టర్ పడని హీరో ఈ రేంజ్ లో యాటిట్యూడ్ చూపెట్టడం సబబు కాదని పలువురు వాదిస్తున్నారు. ఇక మరికొందరైతే లైగర్ ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమా కూడా తేడా కొడుతుంది అంటూ తమ కామెంట్ ను బాహాటంగా చెప్పేస్తున్నారు.

మరి వారు అన్నట్లుగా ఈ సినిమాలో దమ్ము లేకపోతే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందా అనే సందేహం ఇప్పుడు అందరిలో నెలకొంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోండగా, పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి పాన్ ఇండియా స్థాయిలో లైగర్ మంట పుట్టిస్తాడా.. లేక తుస్సు మంటాడా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆశిస్తున్నట్లుగా సినిమా హిట్టయితే ఓకే.. కానీ.. ఒకవేళ సినిమా ఫట్టు అంటే ఏమిటి పరిస్థితి.. బాబు దేవరకొండ.. ఈ సినిమాతో నువ్వు థియేటర్లలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటావా అని అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఎదురుచూస్తున్నారు.