షాకింగ్: మల్లీశ్వరిని కొట్టిన విక్టరీ వెంకటేష్.. కారణం తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త సాఫ్ట్ అండ్ కూల్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్. అవును.. ఇప్పుడంటే పరిస్థితి మారింది కానీ, 90sలో ఆడవాళ్లు వెంకీ మామ అంటే విపరీతంగా ఇష్టపడేవారు. కేవలం ఆడవాళ్లకోసమే వెంకటేష్ సినిమాలు చేసిన దాఖలాలు కూడా వున్నాయి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ – కత్రినా కైఫ్ జంటగా మల్లీశ్వరి అనే సినిమాతో జగతకట్టడం మనకు తెలిసినదే. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం కూడా తెలిసిందే.

అయితే ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీకి అతిథిగా వచ్చిన ఈ ముద్దుగుమ్మ పై వెంకటేష్ ఫైర్ అయ్యాడట. మల్లీశ్వరి సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చిన కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. కె విజయభాస్కర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన మల్లేశ్వరి సంచలన విజయం సొంతం చేసుకుంది. వెంకటేష్ తమ సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఇకపోతే అప్పుడప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కత్రినా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రావడంతో తెలుగు రాక దర్శకనిర్మాతలను బాగా ఇబ్బంది పెట్టిందట.

అలాగే సదరు సినిమా షూటింగ్ సగం అయినా పూర్తి కాకుండానే కత్రినా కైఫ్ తనకు ఎక్కువ పారితోషకం ఇవ్వాలని డిమాండ్ చేసిందట. అంతేకాకుండా తనతో పాటు వచ్చిన టీంకి కూడా విమాన టికెట్లను నిర్మాతలే భరించాలని డిమాండ్ చేసిందట. ఇవన్నీ ఒప్పుకుంటేనే షూటింగ్ కి వస్తానని కొన్నాళ్లపాటు బ్రేక్ కూడా తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. దాంతో ఆమెపైన చర్యలు తీసుకోవాలని దర్శక నిర్మాతలు చర్చలు కూడా జరిపారట. ఇక ఆమె చేసిన పనులకు తట్టుకోలేక ఆమెపైన చేసుకోబోయాడట వెంకటేష్. అయితే ప్రముఖ నిర్మాత అశ్వినీత సూచన మేరకు కత్రినా కైఫ్ అడిగిన కొన్ని డిమాండ్లను మాత్రమే తీర్చినట్లు సమాచారం.