మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన CPI నారాయణ ..!!

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ మధ్య మెగా ఫ్యామిలీ నుండి కొంత మంది హీరోలు సైతం రాజకీయంగా కూడా ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మెగా కుటుంబం పై . వాటి గురించి తెలుసుకుందాం.CPI Narayana flays 'surrender' of actors to YS Jagan Mohan Reddyమెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం గురించి ఆయన స్పందించడం జరిగింది. ఇదే సందర్భంగా చిరంజీవి గురించి ప్రస్తావించిన ఆయన చిరు తోపాటు తన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుపతిలో తాజాగా మీడియాతో మాట్లాడిన నారాయణ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఓపెనింగ్ చేసేందుకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పు పట్టడం జరిగింది. అంతేకాకుండా చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడు అని పేర్కొన్నారు నారాయణ. అంతేకాకుండా చిరంజీవి ఒక చిల్లర బేరగాడు అంటూ పలు సంచల వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులకు చాలా కోపం తెప్పించేలా ఉన్నాయి ఈయన మాటలు.చిరంజీవి, పవన్ పై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్ - CPI Narayana Sensational Comments on Chiranjeevi, Pawan kalyan– News18 Teluguపశ్చిమగోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు.. అల్లూరి సీతారామరాజు ని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ ను పిలవకుండా ఒక చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజ్ మీదకు తీసుకువచ్చి తన పక్క కూర్చోబెట్టారని విమర్శించడం జరిగింది. అంతేకాకుండా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో నాకు తెలియదు కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక ల్యాండ్ మైన్ వంటి వారు అది ఎప్పుడు పేలుతుందో ఎవరూ చెప్పలేము . మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిందేమి కాకపోయినా జగన్ కేవలం తన కేసులు మాఫీ కోసమే ప్రభుత్వానికి సరెండర్ అయ్యారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీంతో మెగా అభిమానుల సైతం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.