వారెవ్వా..బాలయ్య సినిమాలో ఆ లేడీ విలన్.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా..?

నందమూరి బాలకృష్ణ వయసు తో సంబంధం లేకుండా..వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. కుర్ర హీరోలకు సైతం షాక్ ఇస్తూ..క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో కెరీర్ లోనే తిరుగులేని విజయం అందుకున్న నందమూరి బాలయ్య..ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ పవర్ ఫుల్ మాస్ సినిమాను చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన, ఫస్ట్ లుక్, టీజర్ అభిమానుల అంచనాలను పెంచేశాయి. మరీ ముఖ్యంగా బాలయ్య నోట మాస్ డైలాగ్ లు వింటే జనాలాకి పిచ్చెక్కిపోద్ది. “భయం నా బయో డేటాలోనే లేదురా బోసడీకే..” అంటూ చెప్పే డైలాగ్ బాగా హైలెట్ గా నిలిచింది. కాగా, ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే..వీలైనంత త్వరగా..అనిల్ రావిపూడి తో సినిమాను సెట్స్ పై కి తీసుకెళ్ళనున్నాడు బాలయ్య.

ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న అనిల్.. హీరోయిన్ గా ప్రియమణి నీ సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు..ఈ సినిమా లో కూతూరుగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని కూడా ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ క్రేజీ పవర్ ఫుల్ రోల్ ఉందని..దానికోసం కోలీవుడ్ స్టార్ కిడ్ వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఎంపిక చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. క్రాక్ సినిమా లో జయమ్మ గా గుర్తుండిపోయే విలనిజం పండించిన ఈ బ్యూటీ.. బాలయ్య 107 సినిమాలో ను విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని పై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు బాలయ్య తదుపరి సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది అని వార్తలు రావడం..నిజంగా వరలక్ష్మి కెరీర్ కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.