నేను దూరంగానే ఉంటా..నమ్మకం పోయింది..సమంత సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ కుందనపు బొమ్మ ..సమంత. ఏమాయ చేసావే సినిమా తో టాలీవుడ్ ప్రెక్షకులకి తన లేలేత అందాలను పరిచయం చేసి.. నిజంగా కుర్రాళ్లను మాయ చేసేసింది. అంతేనా తన నటనతో మంచి మంచి అవకాశాలు అందుకుని..కెరీర్ లో స్పీడ్ గా ఎదిగింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..ఇలా స్టార్ స్టేటస్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో పట్టుదల..కృషి..కష్టపడే తత్త్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కనుకే సమంత టాప్ హీఇరోయిన్ గా ఇప్పటికి కొనసాగుతుంది.

సమంత సినీ కెరీర్ ఎంత సాఫీగా కొనసాగుతుందో..వ్యక్తిగత విషయాలు అలా గందరగోళంగా ఉన్నాయి. మనకు తెలిసిందే..సమంత తన భర్త హీరో అయిన నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించుకుని..ప్రెద్దలను ఒప్పించి..గ్రాండ్ గా పెల్లి చేసుకున్న ఈ జంట మధ్య ఏవో గొడవలు వచ్చి ..విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. రీజన్స్ తెలియవు కానీ వీళ్ల మధ్య గట్టి ఫైట్ నే జరిగింది. మెగాస్టార్ సైతం మ్యాటర్ లోకి ఎంటర్ అయిన..ఏం చేయలేక చేతులు ఎత్తేశాడట. ఇక నాగార్జున కూడా వాళ్ళ లైఫ్ వాళ్ల ఇష్టం.. మనం ఏం చేయలేం..ఎక్కడ ఉన్నా ఇద్దరు హ్యాపీ గా ఉండాలి అంటూ ఓ పోస్ట్ తో మ్యాటర్ కి ఎండ్ పెట్టేశాడు.

కాగా, విడాకుల తరువాత సమంత రకరకాల పోస్ట్ ల ద్వార..తన మనసులోని బాధ బయటపెడుతుంది. రీసెంట్ గా అభిమానులతో కాసేపు ముచ్చటించిన సామ్ తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంది . ఈ క్రమంలో నే ఓ నెటిజన్.. “ఒకే టైంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం మీకు ఎలా అనిపిస్తుంది ” అని అడిగారు..దీనికి సమంత సమాధానమిస్తూ.. “ఆ రెండింటికి దూరంగా ఉండాలి అని గట్టిగా అనుకున్నాను” అని..చెప్పుకొచ్చింది. అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని సామ్‌ చెప్పుకొచ్చింది. దీంతో ప్రేమ‌పై కూడా త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ఈ సమాధానం ద్వారా సమంత చెప్ప‌క‌నే చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. సమంత మాటల బట్టి చూస్తుంటే చైతన్య సమంత ని మోసం చేసిన్నట్లుందని అనుకుంటున్నారు జనాలు.