అక్కడి నుండి పిలుపు..ఉబ్బితబ్బిపోతున్న పూజా..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న పొడుగాల సుందరి పూజా హెగ్డే వరుసగా మూడు ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని..మళ్ళీ ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. ఆమె రీసెంట్ గా నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య..మూడు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఈ మూడు సినిమాల పై అమ్మడు ఓ రేంజ్ లో ఊహించుకుంది. నిజాని పూజా నే కాదు జనాలు కూడా ఈ మూడు సినిమాల పై ఆకాశాని తాకే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ, తాము ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు.. బాక్స్ ఆఫిస్ వద్ద సినిమా తుస్సు మనిపించాయి.

ఈ మూడు సినిమాలో హీరోయిన్ పూజా ఒక్కరే కావడం అది కూడా పూజా హెగ్డే కావడం..కొంచెం ఆమె కెరీర్ కు మైనస్ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అంచనా వేశారు. కానీ, అమ్మడు అదృష్టం ఎంత బాగుందంటే.. ఆమె కలలో కూడా ఊహించని దగ్గర నుండి పిలుపు అందుకుంది. ఎంతో పాపులారిటి..ఎంతో లక్ ఉంటేగానే అలంటి అవకాశం రాదు అంటున్నారు ప్రముఖులు. ఇంతకి పూజా కి దక్కిన ఆ లక్కి ఛాన్స్ ఏంటో తెలుసా..?

పూజా హెగ్డే కు అనుకోకుండా 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో పాల్గొనేందుకు ఇన్విటేషన్ వచ్చింది. ఈ అవకాశం అందరికి రాదు. దీంతో ఈ బుట్ట బొమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో బడా బడా సెలబ్రిటీలే పాల్గొంటారు. దీని కోసం ఇప్పటికే ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీస్ అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, కంగన రనౌత్, ప్రియాంక చోప్రా వంటి సీనియర్ తారలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఇలాంటి టైంలో పూజాకు అవకాశం ఇంత మంచి అవకాశం దక్కడం విశేషం. ఇలాంటి అవకాశం వస్తుందని పూజా అస్సలు ఊహించలేదట..చాలా చాలా హ్యాపీ గా ఉందంటూ అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలో పూజా ఆ 16వ తేదీన ఇండియా నుంచి పారీస్‌కు బయల్దేరి.. ఇక ఆ తరువాత ప్రపంచంలోని టాప్ స్టార్లతో కలిసి పూజా హెగ్డే విందులో పాల్గొననుంది.