మహేశ్ బాబు కు సారీ చెప్పిన కీర్తి సురేష్..ఏమైందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న మహా నటి కీర్తి సురేష్ ..సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కు సారీ చెప్పింది. ఈ విషయాని ఆమె స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. మనకు తెలిసిందే వీళ్లిద్దరు కలిసి డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో “సర్కారు వారి పాట” అనే సినిమాలో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం..మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగ నిన్ననే మూవీ టీం ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు.

150 షాట్స్ తో కూడిన సీన్స్ మ్యాచ్ చేస్తూ..ట్రైలర్ అధ్బుతంగా తీర్చిదిద్దారు టీం. ఇక రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్క అంటున్నారు అభిమానులు. కేవలం అభిమానులే కాదు..మిగత వారు కూడా సినిమాలో కామెడీ టైమింగ్ బాగుంది.. కీర్తి – మహేశ్ జంట బాగా కుదిరింది.. వీళ్ల మధ్య సీన్స్ కూడా అద్దిరిపోతాయి అని ట్రైలర్ ని చూసే అంచనా వేసేస్తున్నారు జనాలు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసింది.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యుల్లో సినిమా గురించిన విశేషాలు చెప్పుతూ.. ఆమెకు మహేశ్ కు మధ్య జరిగిన ఓ ఫన్ని మూమెంట్ గురించి వివరించింది. సినిమా షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేశాము అంటూ చెప్పుతూ..”నేను ఓ సాంగ్ షూట్ టైంలో పోరపాటున రెండు సార్లు మహేస్శ్ సార్ ముఖం పై చెయ్యితో అలా తగ్గిలింది. బై మిస్టేక్ గా అలా జరిగింది. దీనికి అప్పుడే నేను సారీ చెప్పాను. మళ్ళీ మూడోసారి కూడా అలాగే ఆయన ముఖం పై తగలడంతో మహేశ్ కామెడీగా.. ‘నేను ఏమైనా తప్పు చేశానా నీకు?” అంటూ సరదాగా అడిగారని చెప్పుకొచ్చింది కీర్తి. ఇక ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం సినిమా కుమ్మేస్తుంది అనడంలో సందేహం లేదు.