మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి కన్ఫమేషన్ రాకపోవడంతో చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ సినిమా ఫైనల్ అవుట్పుట్ విషయంలో మెగాస్టార్ హ్యాపీగా లేరని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాకు కావాల్సిన మార్పులు చేర్పులు ఆయన దగ్గరుండి చేస్తున్నారని తెలుస్తోంది.
ఏప్రిల్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆచార్య రెడీ అవుతుండగా ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అసలు వేసవి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేరా అనే సందేహం అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను కొరటాల ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తూనే ఓ చక్కటి మెసేజ్ను కూడా ఇవ్వనున్నాడట. ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడని, ఆయన పాత్ర ఈ సినిమాకే వెన్నుముక్క కానుందని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. మరి ఆచార్య సైలెంట్ వెనక అసలు కథ ఏమై ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు. వారి సందేహానికి ఫుల్స్టాప్ పెట్టాలంటే చిత్ర యూనిట్ నుండి ఏదైనా అప్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.