కిక్కులోనే కానిస్తానంటోన్న కేజీయఫ్ డైరెక్టర్..!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’ తాజాగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి వసూళ్ల మోత మోగిస్తోంది. ‘కేజీయఫ్ చాప్టర్ 1’కు వచ్చిన భారీ రెస్పాన్స్‌తో ఈ సీక్వెల్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక కేజీయఫ్-2 సినిమాతో కేవలం సౌత్ ఆడియెన్స్‌నే కాకుండా నార్త్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు ఈ డైరెక్టర్.

ఇక కేజీయఫ్-2 మేనియాతో ప్రేక్షకులు ఊగిపోతుంటే, ఈ సినిమా డైరెక్టర్ తన నెక్ట్స్ మూవీని కూడా ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్, సలార్‌ను పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తాను కథలను ఎప్పుడు రాస్తాడో చెప్పుకొచ్చాడు.

ప్రశాంత్ నీల్ తాను కథలను మద్యం సేవించిన తరువాతే రాస్తాడని.. ఆ మరుసటి రోజున తాను రాసుకున్న కథలో ఏవైనా మార్పులు ఉంటే చేస్తాడని చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్. ఏదేమైనా కేజీయఫ్ లాంటి భారీ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఇలా డేరింగ్ కామెంట్స్ చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు కేజీయఫ్ ఫ్యాన్స్. ఇక సలార్ చిత్రంతో ప్రభాస్‌కు మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో అదిరిపోయే విజయాన్ని ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు.