ఆ తల్లి ఉసురు కొరటాలకి తగులుతుందా..?

యస్..ఇప్పుడు నెట్టింట ఇదే డిస్కర్షన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ సినిమా గా రాబోతున్న చిత్రం ” ఆచార్య”. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా ధియేటర్ లల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రీసెంట్ గా ప్రి రీలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ అంతా బాగానే జరిగినా..మొదటి నుండి సినిమాలో హీరోయిన్ గా ఉన్న కాజల్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. అస్సలు ఆమెను హీరోయిన్ గానే లెక్కలో వేయలేదు.

దీంతో , నెట్టింట ఈ ఇష్యూ బాగా వైరల్ అయ్యింది. ఇది వరకే తండ్రీ కొడుకులు ఆమె తో సినిమాలు తీశారు. హిట్లు కొట్టారు. చిరంజీవి అయితే పెళ్లి తరువాత ఫస్ట్ టైం ఆచార్య షూటింగ్ సెట్ కు వచ్చిన కాజల్ దంపతులకు స్పెషల్ విషెష్ చెప్పి బొకే ఇచ్చారు. ఇంత జరిగిన ..చిరు కాజల్ పేరు ఎత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల నుండి ఇదే ఇష్యూ అన్ని మీడియా ఛానెల్స్ లో హైలెట్ అవుతుంది. దీంతో ఫైనల్ గా కొరటాలు నోరు విప్పాడు. మా సినిమా లో కాజల్ హీరోయిన్ కాదు..ఆమె తప్పుకునింది అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో , మ్యాటర్ మరింత సీరియస్ అయ్యింది. ఇన్ని రోజులు ఈ విషయాని చెప్పకుండా.. ఇప్పుడు ..తీరా మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదల అవుతుంది అనగా..ఆమె పేరు క్రేజ్ ఫాలోయింగ్ వాడుకుని..ఫైనల్ గా హ్యాండ్ ఇచ్చావా..అంటూ కాజల్ ఫ్యాన్స్ కొరటాల ను తిట్టిపోస్తున్నారు. నువ్వు ఆమెను తీసేసి ఇన్ని నెలలు గడుస్తున్నా..ఇప్పటి వరకు చెప్పలేదు..అంటే నువ్వు ఆమె పేరుని వాడుకున్నావ్..స్టార్ హీరోయిన్ కాజల్ అన్న పేరు ని సినిమా కోసం వాడుకుని..కాజల్ ని అవమానించావ్. ఆమె కడుపుతో ఉంది అని తెలిసి కూడా ఇంత చేసావ్ నువ్వు..ఇప్పుడు ఆమె తల్లి అయ్యింది..ఓ బిడ్డ కు అమ్మ..ఆమె నీ సినిమా కారణంగా భాధపడితే.. బాలింత ఉసురు నీకు తగులుతుంది ..అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ తో కొరటాలను ట్రోల్ చేస్తున్నారు కాజల్ ను అభిమానించే వాళ్ళు. ఏది ఏమైనా కొరటాల కాజల్ విషయంలో తప్పు చేశాడనే అంటున్నారు సినీ ప్రముఖులు..? మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..?