వాస్తవానికి ఆయా దర్శకులు తాము రాసే కథలను పలానా హీరో చేస్తే బాగుంటుంది అని మనసులో అనుకునే స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తారు. అయితే ఆయా హీరోలు నో చెప్పడమో.. సమయం లేకపోవడమో జరిగితే.. ఆ కథలు ఇతర హీరోల దగ్గరికి చేరుతాయి. మొత్తంగా ఏ కథలు ఎటు తిరిగి.. ఎవరి వద్దకు వెళ్తాయో చెప్పడం కష్టం. ఒక్కోసారి సూపర్ మిట్ సినిమాలను కూడా స్టార్ హీరోలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ మూవీ రాధే శ్యామ్. ఈ సినిమా సైతం పలువురు హీరోల దగ్గరికి వెళ్లి చివరకు ప్రభాస్ దరికి చేరింది. రెండున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ కొనసాగింది. తాజాగా ఈ నెల 11న విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా ఏ హీరో దగ్గరికి వెళ్లింది? ఎందుకు వదులుకున్నాడో చూద్దాం..
రాధే శ్యామ్ సినిమా కథ నేరుగా ప్రభాస్ దగ్గరికి రాలేదు. ఈ సినిమా దర్శకుడు కూడా రాధాకృష్ణ కుమార్ కాదు. వాస్తవానికి ఈ కథ మరో హీరో దగ్గరికి వెళ్లి రిజెక్ట్ అయ్యింది. వాస్తవానికి ఈ కథ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిది రాశాడట. పామిస్ట్రీ అన్న పాయింట్ను బేస్ చేసుకుని స్టోరీ రెడీ చేశాడట. దీన్ని టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్లాడట. మొత్తం కథ విన్న వెంకటేష్ సెకెండ్ ఆఫ్ బాగా లేదు అని చెప్పాడట.
అటు సురేష్ బాబు కూడా సినిమా కథను ఓకే చేసేందుకు చాలా సమయం తీసుకుంటాడు. చంద్ర శేఖర్ తనకు కూడా ఈ కథను చెప్పాడట. ఎంతకూ ఆయన తేల్చ లేదట. దీంతో ఆ కథను చంద్ర శేఖర్ అమ్మేశాడట. ఆ తర్వాత ఆ కథలోకి పామిస్ట్రీతో పాటు లవ్ స్టోరీని కూడాచేర్చారట. చివరకు ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా రూపాంతరం చెందింది. ముందుగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ టీం ఏకంగా 2 సంవత్సరాల పాటు ఈ సినిమా మీద ఫోకస్ పెట్టిందట. ఈ సినిమాను మొత్తంగా సుమారు రూ. 250 కోట్లు పెట్టి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఏ రేంజిలో పేలుతుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
రాధే శ్యామ్ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ?
