మా మధ్య ఉన్న ప్రాబ్లమ్ అదే..ప్రభాస్‌తో గొడవ పై పూజా సంచలన కామెంట్స్ ..!!

బాహుబలి సినిమాతో తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్న హీరో ప్రభాస్. ఆయన తాజాగా నటించిన పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతున్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమాని డైనమిక్ డైరెక్టర్ రాధా కృష్ణ తన స్టైల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరి..పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలిజ్ అయిన పోస్టర్, ఫస్ట్ లుక్స్ టీజర్, ట్రైలర్, పాటలు..యూట్యూబ్ లో సంచలన రికార్డులు నెలకొల్పాయి.

కాగా, ఈ సినిమా మరో మూడు రోజుల్లో మనం ముందుకు రాబోతుంది. ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి ఏవో కారణాలు చెప్పుతూ..సినిమాని పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. కానీ ఈసారి ఎలాగైన చెప్పిన డేట్ కి రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్ని పనులు పూర్తి చేశారు మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్రమోషన్స్ ని స్పీడ్ గా లాకోస్తున్నారు.

ఈ క్రమంలోనే పూజా,ప్రభాస్..ఇద్దరు కంటీన్యూ గా ఇంటర్వ్యులు ఇస్తూ..సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే పూజా తనకు ప్రభాస్ కు మధ్య ఏదో గొడవ జరిగిపోతుందని..మాట్లాడుకోవట్లేదని..వస్తున్న వార్తల పై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యింది. రీసెంట్ గా ముంబై లో ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పూజ మాట్లాడుతూ..” ప్రభాస్ తో నాకు గొడవ. అలాంటిది ఏం లేదు. ప్రభాస్ చాలా మంచోడు . తనతో నటించే కో స్టార్స్ ని బాగా అర్ధం చేసుకుంటాడు. గొప్ప మనసున్న వ్యక్తి. ఈ సినిమా షూటింగ్‌ టైం లో ప్రతి రోజు ప్రభాస్‌ నాకోసం తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు..చిన్న ప్రాబ్లమ్ రాకుండా చూసుకున్నాడు. ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ప్రభాస్ షర్ట్ లేకుండా రొమాన్స్ చేసే సీన్స్. అప్పుడు మేము ఇబ్బందిగా ఫీల్ అయ్యామే కానీ..మా మధ్య పరసనల్ గొడవలు ఏం లేవు. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి? అవన్నీ పుకారే. నేనే కాదు ఎవరైనా సరే ప్రభాస్ తో మాట్లాడకుండా ఉండలేరు. అంత మంచి హీరో తను” అంటూ చెప్పుకొచ్చింది.