కేజీఎఫ్ 2.. కథ కంచికేనా?

కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచి, అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా కమర్షియల్ చిత్రాన్ని, అంతే పక్కా ప్లానింగ్‌త అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్ది, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యశ్, ఓవర్‌నైట్‌లో బడా స్టార్ అయిపోడు.

ఇక కేజీఎఫ్ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రెడీ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటకే పూర్తికాగా, ఈ సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాపై కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫట్ అంటుందో చెప్పడం కష్టంగా ఉందని చిత్ర యూనిట్ గ్రహించింది.

అందుకే, తమ సినిమాకు అనవసరమైన భారీ ప్రమోషన్స్‌ను దూరంగా పెట్టాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ నిర్ణయించింది. కేజీఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులు నిజంగానే ఆసక్తిగా ఉంటే, వారు ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2కి సంబంధించి ఎలాంటి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు ఉండవని, కేవలం చిత్ర ట్రైలర్ రిలీజ్ మాత్రమే ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ ప్రకటనతో కేజీఎఫ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వారు ఈ సినిమా నుండి భారీ ప్రమోషన్స్ కావాలని, తద్వారా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతాయని వారు అంటున్నారు. ఇక యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.