గతేడాది స్టార్టింగ్లో కరోనా తర్వాత క్రాక్తో సూపర్ హిట్ కొట్టాడు మాస్ మహరాజ్ రవితేజ. ఈ యేడాది ఆరంభంలోనే ఖిలాడి సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు రాక్షసుడు, గతంలో రవితేజతో వీరా సినిమా చేసిన రమేష్వర్మ దర్శకత్వం వహించారు. రవితేజ స్టైలీష్ లుక్, మాస్ కంటెంట్, ఇద్దరు హీరోయిన్లు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి అందచందాలు సినిమాను ఓ రేంజ్లో నిలబెట్టేశాయి.
ఇక ఏపీ, తెలంగాణలో రు. 25 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. సినిమాలో రవితేజ నటన బాగున్నా కంటెంట్ వీక్గా ఉందన్న టాక్ అయితే వచ్చింది. ఈ వీక్ కంటెంట్తో రవితేజ రు. 25 కోట్ల బ్రేక్ ఈవెన్కు చేరుకుంటాడా ? అన్నది డౌటే ? ఇక తొలి రోజు వసూళ్లు చూస్తే నైజాంలో రు 1.86 కోట్లు, ఇక ఏపీలో 1.88 కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఏరియాల వారీగా చూస్తే నైజామ్ 1.86 కోట్లు – సీడెడ్ 56 లక్షలు – వైజాగ్ 46 లక్షలు – ఈస్ట్ 26 లక్షలు – వెస్ట్ 21 లక్షలు – కృష్ణా 18 లక్షలు – గుంటూరు 56 లక్షలు – నెల్లూరు 21 లక్షల షేర్ రాబట్టింది. ఏపీలో ప్రస్తుతం సెకండ్ షోలకు అనుమతులు లేవు. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అమల్లో ఉంది. అయినా కూడా ఈ పరిస్థితుల్లో ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రు 4.30 కోట్ల వసూళ్లు వచ్చాయి. మరి డి జె టిల్లుకు హిట్ టాక్ రావడంతో యూత్ అటు కనెక్ట్ అవుతున్నారు. ఈ టైంలో రవితేజ ఏదైనా సంచలనం చేస్తే తప్పా ఖాలాడి గట్టెక్కేలా లేదు.