భారత సినీ సంగీత దిగ్గజం, గాన కోకిల లతా మంగేష్కర్ మృతి యావత్ భారత సినీ, గాన ప్రేమికులకు తీరని లోటు అని చెప్పాలి. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యదేవతగా ఆమె కీర్తించబడ్డారు. చరిత్ర పుటల్లో లతాజీ తిరుగులేని గాయనిగా మిగిలిపోయారు. ఆమె కెరీర్ పరంగా ఎన్నో రికార్డులు నమోదు చేసినా కూడా ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం కాస్త బాధాకరమే.
పద్దతైన చీరకట్టుతో అచ్చ భారతీయ ఆడపడుచులా కనిపించే లతాజీ బాలీవుడ్లో టాప్ సింగర్గా వెలుగొందుతోన్న వేళ అప్పటి స్టార్ క్రికెటర్తో ప్రేమలో పడ్డారు. బీసీసీఐ మాజీ సెలక్టర్ అయిన, మాజీ క్రికెటర్ రాజ్సింగ్ దుంగాపూర్ – లత ప్రేమలో పడ్డారు. 13 ఏళ్ల వయస్సులోనే తండ్రి మరణంతో లత కుటుంబ బాధ్యతలు అన్నీ తానే తీసుకున్నారు. ఇక లత సోదరుడు ముంబైలో లా చదవడానికి వచ్చిన రాజ్సింగ్ ఫ్రెండ్స్ అయ్యారు.
అలా రాజ్సింగ్ లతకు పరిచయం కావడంతో పాటు వారు స్నేహితులు అయ్యి… ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ముందుగా రాజ్సింగే తన ప్రేమను బయట పెట్టాడు. లత కూడా ఒకే చెప్పింది. అయితే రాజ్సింగ్ కుటుంబం రాజస్థాన్లో రాజవంశీకుల కుటుంబం. రాజ్సింగ్ తల్లిదండ్రులు నువ్వు సినిమాల్లో పాటలు పాడే అమ్మాయిని మా ఇంటికి కోడలిగా తీసుకువస్తావా ? అని ఫైర్ అయ్యారు.
అయితే తన ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో రాజ్సింగ్ తన ప్రేమను లతాజీకే అంకితం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. నీకు లేని పెళ్లి నాకు మాత్రం ఎందుకని లత కూడా పెళ్లికి దూరం అయిపోయింది. పెళ్లి లేని జీవితంతో ఎప్పుడు అయినా ఒంటరితనం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా..? అంటే అత ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
తన బెస్ట్ ఫ్రెండ్స్లో నర్గీస్, మీనా కుమారి అత్యంత ఆప్తులు వారు ఇప్పుడు లేరు. వారు చనిపోయే వరకు నాకు చివరి వరకు టచ్లోనే ఉన్నారు. ఇక దేవానంద్ నాకు బెస్ట్ ఫ్రెండ్. పాటలు పాడడం నాకు ఇష్టమైన విషయం కావడంతో.. నేను ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ కాలేదని ఆమె చెప్పారు.