అరగంటకు కోటి రూపాయలా.. ఈ హీరోయిన్ రేటుకి దిల్ రాజు దిమ్మ తిరిగిపోయిందిగా..?

ఈ మాయదారి మహమ్మారి కరోనా కారణంగా పప్పు ఉప్పు రేట్లు అన్నీ భారీగా పెరిగిపోయాయి. ఒక మధ్య తరగతి కుటుంబం కడుపు నిండా కనీసం అన్నం కూడా తినలేనంతగా నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. అన్ని ధరలు పెరుగుతున్నాయి మనం రేటు పెంచితే తప్పేముంది అనుకున్నారో ఏమో కాని.. స్టార్ హీరో హీరోయిన్లు కూడా వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారు. చిన్న హీరోలు సంగతి పక్కన పెడితే..ఓ రేంజ్ యావరేజ్ హీరోల దగ్గర నుండి..స్టార్ హీరో ..పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలో నటించే ప్రతి హీరో పారితోషకానీ పెంచుకుంటూ పోతున్నారు.

ఇక వాళ్లను చూసి పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు కూడా ..హీరోలకు మేం ఏమాత్రం తీసిపోం అన్నట్లు డబుల్ చేసారు రెమ్యూనరేషన్ని. ఇప్పటికే నయనతార అందరికన్న ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా కూడా సినిమా 2-3 కోట్లు ఛార్జ్ చేసే ఈ బ్యూటీ..అల వైకుంఠపురం లో సినిమా తరువాత..ప్రతి సినిమాకు 5 కోట్లు తగ్గకుండా పారితోషకాని తీసుకుంటుందట.

ఇక నేషనల్ క్రష్ హాట్ బ్యూటీ రష్మిక కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించి..సామీ సామీ అంటూ నడుమును తిప్పుతూ ఊపేసిన ఈ అమ్మడు..ఈ సినిమా హిట్ అవ్వడంతో రేంజ్ తో పాటు రెమ్యూనరేషన్ ని కూడా పెంచేసిందట. పుష్ప 2 కి 4 కోట్లు పారితోషకానీ డిమాండ్ చేసిన్నట్లు టాక్ వినపడుతుంది. ఇక రీసెంట్ గా చరణ్-శంకర్ కాంబోలో రాబోతున్న RC15 సినిమాలో ఓ 20 నిమిషాల పాత్ర కోసం రష్మికను అప్రోచ్ అయితే అమ్మడు ఏకంగా కొటి రూపాయలు అడిగిందట. ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి గా కనిపిస్తారట..ఆయనను ఇంటర్వ్యు చేసే జర్నలిస్ట్ పాత్రలో రష్మికను తీసుకోవాలి అని అడగ్గా ఆమె చెప్పిన రేటుకు దిల్ రాజు దిమ్మ తిరిగిపోయిందట. కానీ, ఆమెనే ఫైనల్ చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంకెం చేస్తారు సక్సెస్ ను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్న ఈ అమ్మడు అడిగినదానికి ఓకే అంటున్నారు నిర్మాతలు. చూడాలి..చరణ్ ను ఎలా ఇంటర్వ్యు చేస్తుందో ఈ హాట్ బ్యూటీ ..?