అల్లు అర్జున్ దెబ్బకు బోయపాటికి మైండ్ బ్లాక్ ..!

అఖండతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను .తనదైన స్టైల్ లో మాస్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజిలో షేక్ అవుతుందో చూపించాడు బోయపాటి .ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీపై టాలీవుడ్లో జోరుగా వార్తలు అందుకున్నాయి .ఐకాన్ సినిమాని బన్నీ లాక్ చేసికుని పుష్ప 2 కి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ .అందుకే బోయపాటి ఈ గ్యాప్లో యంగ్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు .

అఖండతో బోయపాటి సృష్టించిన సెన్సేషన్ అంత ఇంత కాదు .2016 లో సరైనోడు బ్లాక్ బస్టర్ తరువాత జయ జానికి నాయక , వినయ విధేయ రామ లాంటి సినిమాలు తీసాడు బోయపాటి శ్రీను .అయితే ఆ సినిమాలు కలెక్షన్ పరంగా పర్వాలేదనిపించినా ,బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించలేకపోయాడు బోయపాటి .మళ్లీ బాలయ్య సినిమాతో గొప్ప కం బ్యాక్ హిట్ ఇచ్చాడు .ఈ సారి మాత్రం లెక్క తప్పకూడదు అని తప్పలేదు కూడా బోయపాటి .అందుకే నెక్స్ట్ సినిమాపై ముందే జాగ్రత్త పడుతున్నాడు .బోయపాటి సినిమాపై టాలీవుడ్లో జోరుగా రూమర్స్ వినిపిస్తున్నాయి .

నిన్నటివరకు అల్లు అర్జున్తో బోయపాటి సినిమా ఫిక్స్ అన్నారు .కానీ ఐకాన్ స్టార్ పుష్ప 2 తో బిజీ అయ్యారు .మరోవైపు బోయపాటి కూడా అఖండ 2 కూడా తెరకెక్కిస్తాడంట .కానీ బాలయ్య వరస ప్రాజెక్టులో బిజీ గా ఉన్నాడు .అందుకే బోయపాటి న్యూ కాంబినేషన్ పనిలో పడ్డాడు .ఇస్మార్ట్ శంకర్ తో మాస్ తో క్రేజ్ సంపాదించుకున్న రామ్ ,నెక్స్ట్ రెడ్ లాంటి వైవిధ్యమైన సినిమా చేసాడు రామ్ .ప్రస్తుతం ఈ యంగ్ హీరో కోలీవుడ్లో తన మార్కెట్ పెంచుకోవటానికి ప్లాన్ చేస్తున్నాడట .