RC15 రిలీజ్‌పై ఫుల్ క్లారిటీతో ఉన్న చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా ఓ కేమియో రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ కాకముందే, చరణ్ తన కొత్త చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాలో చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2023 ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక అంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమాను నిజంగానే 2023 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారా లేరా అనేది తెలియాల్సి ఉంది.