పంచుల ప్రవాహంతో..శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో.. వైరల్..!

బుల్లితెరపై ఈటీవీ లో ప్రసారమయ్యే షో శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఈ షో కి కూడా మంచి టిఆర్పి రేటింగ్ లభిస్తోంది. ఈ షో కి సుధీర్ యాంకర్ గా పని చేస్తున్నాడు. అయితే తాజాగా యశోద సంబంధించి ప్రోమో ఒకటి వైర్లతో మారుతోంది. షో కి గెస్ట్ గా హీరోయిన్ మహేశ్వరి వచ్చింది. ఈ షోలో భాగంగా ఆమెను ఆహ్వానిస్తూ సుధీర్ ఆమెతో చేయి కలిపే ప్రయత్నం చేయగా.. ఆమె చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తోంది.

ఎందుకు అలా చేశారని సుధీర్ అడగగా.. నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావ్ అంటూ మహేశ్వరి పంచులు పేల్చింది దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.. సుధీర్ మేడం మీరు నన్ను ఎక్కడ ఉండమంటారు అడగగా.. నా నుంచి మాత్రం దూరంగా ఉండు చాలు అంటూ మహేశ్వరి కౌంటర్ వేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక గులాబి సినిమాతో మొదటి సారిగా కెరీర్ ప్రారంభించింది హీరోయిన్ మహేశ్వరి. తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ ను విడిచిపెట్టి 2008లో తిరుపతిలో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ జయకృష్ణ వివాహం చేసుకుంది.