మ‌ళ్లీ ఒకే చెంత‌కు చేరిన చైతు-సామ్‌.. కార‌ణం అదేన‌ట‌..!

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందిన నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించుకుని, పెద్ద‌ల‌ను ఒప్పించి ఆపై గోవాలో అంగ‌రంగ‌వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్‌ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే చైతు-సామ్‌లు త‌మ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు.

చై-సామ్‌లు విడిపోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. ఇటు సోష‌ల్ మీడియాలోనూ, అటు ప్ర‌ధాన మీడియాలోనూ వీరిద్ద‌రి గురించి ఏదో ఒక వార్త తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి. కానీ, అవేమి ప‌ట్టించుకోకుండా చై-సామ్‌లు ఎవ‌రి లైఫ్‌ను వారు బిజీ బిజీగా లీడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్ద‌రూ మ‌ళ్లీ ఒకే చెంత‌కు చేరారు.

విడిపోయామ‌ని ప్ర‌క‌టించాక వీరిద్దరూ ఒకరినొకరు మళ్ళీ కలుసుకోలేదు. ఒకరి గురించి ఒకరు మాట్లాడలేదు. అయితే ఒకే ఫీల్డ్ లో ఉన్నారు కాబ‌ట్టి.. ఏదో ఒక స‌మ‌యంలో చై-సామ్‌లు ఎదురుప‌డాల్సిందే. ఇటీవ‌ల‌ అలాంటి సంద‌ర్భ‌మే వీరిద్ద‌రికీ వ‌చ్చింది. చైతన్య నటిస్తున్న `బంగార్రాజు` సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరగగా.. సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న `యశోద` చిత్రీకరణ కూడా అదే స్టూడియోలో జరిగింది.

దీంతో నాగ చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రూ రామానాయుడు స్టూడియోకు వెళ్లారు. కానీ, ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు చూసుకోలేద‌ట‌. క‌లుసుకుని మాట్లాడుకోనూ లేద‌ట‌. ఎవ‌రి ప‌నులు వారు చూసుకుని వెళ్లిపోయార‌ట‌. మొత్తానికి చై-సామ్‌లు ఒకే చెంత‌కు చేరినా క‌లుసుకోక‌పోవ‌డంతో వారి వారి అభిమానుల‌ను తెగ ఫీల్ అవుతున్నారు.