టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రమే `వరుడు కావలెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించగా..సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.
భారీ అంచనాల నడుమ అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మనసులోని ప్రేమని బయటకి చెప్పకుండా నలిగిపోయే ప్రేమికుల కథే వరుడు కావలెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. కలెక్షన్లు మాత్రం సో..సో..గా ఉన్నాయి. మూడు రోజులకు కలిసి ఈ సినిమా కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.
`వరుడు కావలెను` 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజాం- 0.83 కోట్లు
సీడెడ్- 0.30 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.28 కోట్లు
ఈస్ట్- 0.25 కోట్లు
వెస్ట్- 0.20 కోట్లు
గుంటూరు- 0.16 కోట్లు
కృష్ణా- 0.21 కోట్లు
నెల్లూరు- 0.15 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణ- 2.38 కోట్లు షేర్
———————————————
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 0.88 కోట్లు
వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్- 3.26 కోట్లు షేర్
కాగా, వరుడు కావలెను మూవీ వరల్డ్ వైడ్గా రూ.8.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. తొలి మూడు రోజుల్లో 3.26 కోట్లు వచ్చాయి. దాంతో ఇప్పుడీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం మరో 5.50 కోట్లు రావాల్సిందే.