హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక వినాయక చవితి పండుగ రోజున ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. అయితే దాదాపు ఎన్నో రోజుల పాటు ఐసీసీ లోనే ఉంటూ చికిత్స పొందాడు ఈ హీరో. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితమే ఇంటికి రీచార్జ్ అయినట్లుగా తెలిపారు. అయితే చిరంజీవి తాజాగా తన ట్విట్టర్ లో నుంచి హీరో సాయి ధరంతేజ్ విషయాన్ని వెల్లడించారు వాటి గురించి చూద్దాం.
సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు.. ఇదే విషయాన్ని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో తెలియజేశాడు. మా కుటుంబ సభ్యులందరికీ దుర్గా పండుగ లాంటి వార్త, సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోరుకున్న అటువంటి ఒక ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోలు సాయి ధరంతేజ్ తో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబు, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, పవన్ కొడుకు అకీరా ఇలా అందరూ ఉన్నారు.
ఈ ట్వీట్ పై కూడా సాయిధరంతేజ స్పందించాడు. నా పునర్జన్మ కి కారణమైన మీ ప్రేమకు మీ ప్రార్థనలకు ఏమిచ్చి మి రుణం తీర్చుకోగలను మీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ సుకృతం అంటూ ట్వీట్ చేశాడు
నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం.🙏🏼 https://t.co/2de1Ob2JgC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 5, 2021